
యావత్ ప్రపంచం కరోనా సంక్షోభంలో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళలో.. అందుకు భిన్నంగా రికార్డుల మీద రికార్డులే కాదు.. కాలంతో పని లేకుండా తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇటీవల కాలంలో పదే పదే పాజిటివ్ వార్తల్లోకి వస్తున్న రిలయన్స్.. మరోసారి ఇరగదీసిందని చెప్పాలి. ఏప్రిల్ -జూన్ త్రైమాసానికి సంబంధించిన ఫలితాల్ని తాజాగా వెల్లడించింది.
తన వాటాల్ని విక్రయించిన ద్వారా రూ.1.52లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఆర్ ఐఎల్.. ఇంధన విక్రయ వ్యాపారంలో 49 శాతం వాటాను అమ్మటం ద్వారా రూ.7629 కోట్లకు విక్రయించింది. కరోనా నేపథ్యంలో చమురు రిఫైనింగ్ విభాగంలో ఆదాయం తీవ్ర ప్రభావానికి లోనైనా.. అదేమీ రిలయన్స్ మీద పడకపోవటం ఆసక్తికరంగా చెప్పాలి. గత ఏడాది బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చటం ద్వారా 8.9 డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తే.. ఈ ఏడాది కేవలం 6.3 డాలర్లను మాత్రమే సంపాదించింది. అయినప్పటికీ.. వాటాల్ని వినియోగించటంలో వ్యవహరించిన నేర్పు.. రిలయన్స్ కు అధిక ఆదాయాన్నే కాదు.. నికర లాభాన్ని పెంచేలా చేసిందని చెప్పక తప్పదు. అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని తిరిగే ముకేశ్ అంబానీ లాంటోళ్లకు కరోనా లాంటి పరిస్థితుల్లోనూ తిరుగులేని రీతిలో వ్యవహరించటం విశేషమే.
Leave a Reply